Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకుర పరిశ్రమ నిస్కైరూట్ ఏరోస్పేస్ తమ మొట్టమొదటి రాకెట్ విక్రమ్ఎస్ లేదా విక్రమ్1ను శుక్రవారం నింగిలోకి పంపించడానికి రంగం సిద్ధమైంది. చెన్నైకు 115 కిమీ దూరంలో శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ) ఈ రాకెట్ను ప్రయోగిస్తుంది. భారత అంతరిక్ష కార్యక్రమాలకు ప్రైయివేట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం 2020 లోనే ఆహ్వానించిన తరువాత స్కైరూట్ మొట్టమొదటి సంస్థగా రెక్క లు విప్పింది. అంతకుముందు ఈనెల 15 వ తేదీనే ఈ ప్రయోగానికి నిర్ణయమైనప్పటికీ వాతావరణం అనుకూలించక పోవడంతో శుక్రవారానికి మారింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 81 కిలోమీటర్ల ఎత్తుకు నింగి లోకి విక్రమ్ ఎస్ దూసుకెళ్తుంది.