Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రయివేటు రాకెట్ను ఇస్రో శాస్త్తవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే చేపట్టిన ఇస్రో పలు ప్రయివేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపించినా రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఇది రాకెట్ కూడా ప్రయివేటుదే కావడం విశేషం. అయితే ఈ తరుణంలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్కైరూట్ టీమ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సంస్థ కొత్త చరిత్రను లిఖించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు కేటీఆర్. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి వెళ్లింది.