Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరాఖండ్: చమోలీ జిల్లా జోషి మఠ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉర్గాం-పల్లా జకోలా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన ఏకంగా 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది. తదుపరి విషయాలు తెలువాల్సి ఉంది.