Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 21న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. అల్పపీడనం శనివారం ఉదయం మరింత బలపడి రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఆది, సోమవారాల్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, వేలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోతగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 21న కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదే విధంగా ప్రైవేటు వాతావరణ పరిశోధకులు కూడా ఈ నెల 20 నుండి 22 వరకు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.