Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్: పంట పొలాల్లోకి ఆహారం కోసం వచ్చిన జాతీయ పక్షిని ఓ వేటగాడు హతమార్చిన ఘటన శుక్రవారం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అర్జున్ నెమలిని చంపేశాడు. గమనించిన స్థానికులు ఆయణ్ను పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. అటవీశాఖ సిబ్బంది వచ్చి వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. మృతి చెందిన నెమలిని కూడా స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు అటవీశాఖ సెక్షన్ అధికారి ప్రతాప్సింగ్ తెలిపారు.