Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట సమీపంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.