Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం: జిల్లాలోని కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపంలో బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా... మరో మహిళ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారులు హాసిని, సాహిత్లను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు గోపి, రమ్య, తారకేశ్వరిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.