Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకునే జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ప్రాజెక్ట్ కే'. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న షెడ్యూల్ కు సంబంధించి దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నాలుగు సెట్లను రూపొందించినట్టు సమాచారం. ఈ సెట్లలో భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్స్ కోసం విదేశాల నుంచి ఫైటర్స్ ను రప్పించారట. ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.