Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యగ్యంగా వాఖ్యలు చేశారు. గువాహటిలో క్రికెట్ మ్యాచ్ ఉంటే రాహుల్ గాంధీ గుజరాత్ లో ఉంటారు. ఆయన తన వెంట బ్యాట్, ప్యాడ్ ను కూడా సిద్ధంగా పెట్టుకుంటారు. కానీ, మైదానానికి రారు అంటూ వ్యాఖ్యానించారు. మరో రెండు వారాల్లో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయినా రాహుల్ గాంధీ ఇంత వరకు గుజరాత్ ఎన్నికల ప్రచారంలోకి రాలేదు. ఈ సందర్బంలో బిశ్వ శర్మ పరోక్ష విమర్శలు చేశారు. గుజరాత్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని బిశ్వ శర్మ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు, మూడో స్థానాల్లో నిలుస్తాయని జోస్యం చెప్పారు. బీజేపీ ఉన్న స్థానంలోనే ఉంటుంది. బీజేపీకి పోటీ లేదు. రెండు, మూడో స్థానం కోసమే ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందిని వ్యాఖ్యానించారు.