Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢీల్లి: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురించి తెలిసిందే. ఈ మండలిలో ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ తరుణంలో మరి కొన్ని దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం కృషిచేస్తున్నాయి. అందులో భారతదేశం కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలో భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతు పలుకుతున్నట్టు ఫ్రాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యూఎన్ ఓ జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడారు. కొత్త ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాలను గుర్తించి, వాటికి మండలిలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఫ్రాన్స్ పేర్కొంది. ఫ్రాన్స్ విధానం స్థిరమైనదని తెలుసు. నేటి ప్రపంచంలో భద్రతా మండలి కౌన్సిల్ లో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడు మండలి మరింత బలోపేతం అవుతుంది అని ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాతాలీ బ్రోడ్ హర్ట్ శుక్రవారం ప్రకటన చేశారు. భద్రతా మండలిలో 25 సభ్య దేశాలు ఉండాలన్న అభిప్రాయాన్ని వినిపించారు.