Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి బీఎల్ సంతోష్ కు జారీ చేసిన సిటీ నోటీసులను రద్దు చేయాలని కోరింది. ఈ తరుణంలో బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అయితే బీఎల్ సంతోష్ కు నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని సూచించింది. అదే సమయంలో సిట్ దర్యాప్తునకు బీఎల్ సంతోష్ సహకరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.