Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గచ్చిబౌలి టెలికాం నగర్ లో విషాదం నెలకొంది. ముగ్గురు బాలలు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన నానక్ రామ్ గూడ చెరువు వద్ద జరిగింది. దీపక్, పవన్, షాబాజ్ 9వ తరగతి విద్యార్థులు. వీరు సరదాగా ఈత కొట్టేందుకు నానక్ రామ్ గూడ గోల్ఫ్ కోర్స్ పక్కనే ఉన్న చెరువులో దిగారు. వారు మరింత లోతుకు వెళ్లడంతో ఈత రాక మునిగిపోయారు. ఇతర విద్యార్థులు ఈ విషయం గమనించి అక్కడున్నవారికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ ముగ్గురు బాలలు పూర్తిగా మునిగిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాలల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. కాగా, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.