Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం-ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పురాతన సంస్కృతి, జ్ఞానం తదితర అంశాల ద్వారా అనుసంధానించే లక్ష్యంతో కాశీ-తమిళ్ సంగమం వేడుకలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ తరుణంలో ప్రతిష్ఠాత్మక కాశీ-తమిళ్ సంగమాన్ని ప్రధాని మోడీ నేడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోదీ తమిళ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ కాశీ-తమిళ్ సంగమం గంగ, యమున అంత పవిత్రమైనదని అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళ్ కు భారతదేశం పుట్టిల్లు అని వెల్లడించారు. అందుకు మనమంతా గర్వించాలని, ఆ భాష పరిరక్షణకు మరింతగా కృషి చేయాలన్నారు.