Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్లు సన్నద్ధం కావాలంటూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ క్రమక్రమంగా బలపడుతోందని, దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణాంధ్ర, కోస్తా తీరప్రాంతాల్లో వచ్చే మంగళవారం వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటిన అల్పపీడనం ప్రభావంతో కడలూరు, నాగపట్టణం తదితర జిల్లాల పరిధిలో ఉన్న సముద్రంలో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చేపల వేటకు వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.