Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాండూరు: మొయినాబాద్ ఫాం హౌస్ సంఘటన తర్వాత ప్రగతిభవన్లో బస చేసిన వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి శనివారం బయటకు వచ్చారు. 20 రోజుల అనంతరం బయటకొచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో ధర్మశాస్త్ర అయ్యప్పస్వామిని దర్శించుకుని కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఘటన తర్వాత తాండూరుకు వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.