Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామివారికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ వీధుల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. ఇక కార్తిక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.