Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విజయనగరం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్కు మూర్ఛ వచ్చింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బస్సు ఢీకొని ఏడో తరగతి విద్యార్థి సిరికి అభిషేక్ మృతి చెందాడు. అనంతరం రోడ్డు పక్కనున్న ఇంట్లోకి బస్సు దూసుకెళ్లింది. ఇంటి గోడ కూలి మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.