Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: ఆరెపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో విద్యార్థినిల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఐదుగురు విద్యార్థినులు ఫినాయిల్ తాగి అస్వస్థతకు గురయ్యారు. అది గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు... స్ఫూర్తి, జ్యోత్స్న, రిత్విక, ఉమాదేవి, చార్విక. పూర్తి సమాచారం అందవలసి ఉంది.