Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ 20లో సూర్యకుమార్ అద్భుతరీతిలో శతకం సాధించాడు. 49 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దాంతో, భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ 111 స్కోర్తో నాటౌట్గా నిలిచాడు. టీ 20 ఫార్మాట్లో సూర్యకు ఇది రెండో సెంచరీ. హాఫ్ సెంచరీకి 32 బంతులు తీసుకున్న సూర్య ఆ తర్వాత వేగం పెంచాడు. దొరికిన బంతిని దొరికినట్టల్లా బౌండరీకి తరలించాడు. దాంతో మరో 17 బంతులో 50 పరుగులు చేసి, సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొదటి టీ 20 వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. వర్షం రావడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా వచ్చారు.