Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్టీయూఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ తరుణంలో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తామని, ఉద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్రానిది ఫ్రెండ్లీ ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. టీచర్లకు ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించి పరిష్కారం చూపిందని అంతే కాకుండా త్వరలో ఉద్యోగుల ఆరోగ్య కార్డుల విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులను కలవడం సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు. సమాజాన్ని దారిలో నడిపించేది మేధావులేనని హరీశ్ రావు అన్నారు. అబద్ధాలను వ్యాప్తి చేసే మేధావుల సంఖ్య నేటి సమాజంలో పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే నిజాలు మన కళ్లముందే కనిపిస్తాయనన్నారు.