Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవంలో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడించింది. గోవా వేదికగా ఇఫీ చలనచిత్రోత్సవం నేటి (నవంబరు 20) నుంచి ఈ నెల 28 వరకు జరగనుంది.