Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణే: పూణే- బెంగళూరు జాతీయ రహదారిపై నేవల్ వంతెన వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ వాహనాలపై దూసుకెళ్లడంతో 48 కార్లు దెబ్బతిన్నాయి. ఈ పెద్ద రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని పూణె అగ్నిమాపక దళం, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీల రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హైవేపై వేగంగా వస్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయి పలు కార్లను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో రోడ్డుపై ట్యాంకర్ నుంచి ఆయిల్ కింద పడటంతో పలు కార్లు జారి ప్రమాదానికి గురయ్యాయి.ఈ ప్రమాదంతతో ముంబయి వెళ్లే రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది.