Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొత్తకోట మండలంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మళ్ళపల్లి జాతీయ రహదారిపై ట్రాక్టర్ను వెనుక నుంచి గరుడ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 40 మందికి ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన బాధితులను పోలీసులు అంబులెన్స్ లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరు వైపు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం వల్ల ముమ్మాళ్ళపల్లి నుండి అమడబాకుల వరకు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.