Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నాకు ఎలాంటి నోటీసులు అందలేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు తలసాని సాయికిరణ్ యాదవ్. క్యాసినో వ్యవహారంలో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను విచారించిన ఈడి, తాజాగా ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కి నోటీసులు ఇచ్చిందని ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. విచారణకు రావాలని నోటీసులో ఈడీ పేర్కొందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ సంఘటనపై స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ స్పందించారు.