Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 22 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 25 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మెరిట్ జాబితా అదేవిదంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కళాశాల వారీగా సీట్ల వివరాలను knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.