Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జీవో ప్రకారమే జరిమానా విధిస్తున్నామని, ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన ట్రాఫిక్ నిబంధనలు కొత్తవేమీ కాదని జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. 2013 మోటార్ వెహికిల్ యాక్ట్ జీవోలో ఉన్నవేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జీవో ప్రకారమే కొత్త రవాణా నిబంధనలు అమలు చేస్తామన్నారు. రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్లపై జరిమానాలు పెంచుతున్నట్లు తెలిపారు.
ఇకపై రాంగ్రూట్ డ్రైవింగ్కు రూ.1700, ట్రిపుల్ రైడింగ్కు రూ.1200 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రాంగ్రూట్ డ్రైవింగ్ వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రిపుల్ రైడింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమని, ఆదాయం కోసమే జరిమానాలు వేస్తున్నామనేది అవాస్తవమన్నారు. యూ టర్న్లపై మేం కూడా పునః సమీక్షిస్తామని, తరుచూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.