Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి: ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా దుండగులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై కత్తులతో గుత్తి కోయలు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చండ్రుగొండ మండలం బెండలపాడు అటవీప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.