Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: అల్లూరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చి లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.