Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి మహబూబ్నగర్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబరు 08585/08586 విశాఖపట్నం నుంచి మహబూబ్నగర్ వరకు డిసెంబర్ 6 నుంచి 28వ తేదీవరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని వెల్లడించారు.
విశాఖపట్నంలో సాయంత్రం 5.35 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్నగర్కు చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో అదే రైలు మహబూబ్నగర్లో సాయంత్రం 6.20 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. ఈ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొన్నారు.