Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయిల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తాము విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. పోలీసులకు ఇచ్చినట్లుగా తమకు కూడా తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తిరిగి మళ్ళీ విధుల్లో చేరుతామని ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయుధాల అంశంపై సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.