Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ వేధింపులు భరించలేకనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఎంపీపీ కవిత తెలిపారు. గత ఏడాది నుంచి అవమానాలు, హేళనలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎన్నోసార్లు తమపై కేసులు పెట్టారని.. జైలుకు పంపించారని ఎంపీపీ భర్త ఆరోపించారు. గత కొన్నాళ్లుగా ఎమ్మెల్యే రేఖానాయక్తో ఎంపీపీకి విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో కవిత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అటు ఎమ్మెల్యే రేఖానాయక్ తీరుతో ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఖాళీ అవుతోందని కవితా గోవింద్ వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం జెడ్పీటీసీ జానకి కూడా టీఆర్ఎస్కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఎంపీపీ కవితా గోవింద్.. బీజేపీలో చేరుతానని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టనున్నారు. భైంసా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బండి సంజయ్ సమక్షంలో ఎంపీపీ కవితా గోవింద్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.