Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జేసీ అస్మిత్రెడ్డిపై కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అస్మిత్రెడ్డి మూడు రోజులుగా తాడిపత్రి మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం మూడో వార్డులో పర్యటిస్తుండగా వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా బీడీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. విద్యుత్ సరఫరా ఆపేసిన కొందరు ఆయనపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడితో అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడికి దిగారు. ఈ పరస్పర దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న అస్మిత్రెడ్డి ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.