Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: స్కూల్ బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల గుడ్ షెప్పర్డ్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి వశీకర్ ఈరోజు ఉదయం పాఠశాల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింది పడిపోయాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్కూల్ సిబ్బంది విద్యార్థిని నంద్యాల సర్వజన ఆస్పత్రికి తరలించారు. కాగా వశీకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థి బిల్డింగ్పై నుంచి పడిపోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.