Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన వాలకట్ల వెంకటేష్ (30 ) ద్విచక్ర వాహనంపై తన తల్లి కౌసల్య( 55)తో కలిసి వెళ్తున్నారు. వారి వాహనం మొలంగూర్ వాటర్ ప్లాంట్ వద్దకు చేరుకోగానే కోతి అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ సదన్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వారిరువురిని అంబులెన్స్ లో ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.