Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 1990, 2000 సంవత్సరాల కాలంలో వ్యవస్థలోకి విడుదల చేసిన కాయిన్లను ఇప్పుడు క్రమంగా ఆర్ బీఐ వెనక్కి తీసుకుంటోంది. ఇక మీదట కొన్ని రకాల నాణాలు తిరిగి ఇష్యూ చేయడం లేదంటూ ఐసీఐసీఐ బ్యాంకు ఢిల్లీ శాఖ ఒకటి నోటీసు బోర్డులో పెట్టింది. అంటే నాణాలను కస్టమర్లు డిపాజిట్ చేయొచ్చు. కానీ, వాటిని బ్యాంకు తిరిగి మరొకరికి ఇవ్వదు. బ్యాంకు శాఖల నుంచి కాయిన్లను ఆర్ బీఐ వెనక్కి తీసుకుంటోంది. కాపర్ నికెల్ తో చేసిన రూపాయి, 50 పైసలు, 25 పైసలు, స్టెయిన్ లెస్ స్టీల్ తో చేసిన 10 పైసల కాయిన్లు బ్యాంకులకు చేరగానే, వాటిని ఆర్ బీఐకి డిపాజిట్ చేస్తున్నాయి. అలాగే, అల్యూమినియం కంచుతో తయారు చేసిన 10 పైసలు, అల్యూమినియం 20 పైసలు, అల్యూమినియం 10 పైసలు, అల్యూమినియం 5 పైసల కాయిన్లను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. 25 పైసలు, అంతకు లోపు విలువతో కూడిన అన్ని రకాల కాయిన్లను వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లోగడే నిర్ణయించింది. ఒక్కసారి ఈ కాయిన్లు మొత్తం వెనక్కి వచ్చిన తర్వాత వాటి చట్టబద్ధతను రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది.