Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీరు విన్నది నిజమే. ఓ కోతికి జీవిత ఖైదు విధించారు. ఇకపై అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. ఉత్తరప్రదేశ్లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్లో ఓ మాంత్రికుడి వద్ద కాలియా అనే పేరుగల కోతి ఉండేది. దానికి అతడు మద్యం, మాంసం అలవాటు చేశాడు. ఆ రెండింటికి అది బానిసగా మారిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మాంత్రికుడు మృతి చెందాడు. దీంతో దాని ఆలనా పాలనా చూసేవారు కరవయ్యారు.
అయితే మద్యం, మాంసానికి అలవాటు పడిన ఆ మర్కటం అవి దొరక్కపోవడంతో అల్లాడిపోయింది. వాటి కోసం జనంపై దాడిచేసేది. అంతేకాకుండా మద్యం దుకాణం వద్ద కాపుకాసేది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని ఎత్తుకెళ్లేది. ఇలా 250 మందిపై దాడిచేసి గాయపరిచింది. దాని బాధలు భరించలేని స్థాయికి చేరుకోవడంతో 2017లో స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి దానిని పట్టుకుని జూలో బంధించారు. ఆ తర్వాత దానికి వైద్యం అందించారు. ఐదేళ్లపాటు దానికి వైద్యం అందించినా దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇకపై దానిని జూలోనే జీవితాంతం బందీగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.