Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కెనడాలో ఓ భారత విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పోలీసులు తెలిపిన ప్రకారం యోంజీ స్ట్రీట్, సెయింట్ క్లేర్ అవెన్యూ ప్రాంతాల మధ్య బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. బాధిత విద్యార్ధి (20) టొరంటోలో సైకిల్పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన పికప్ ట్రైన్ ఢీ కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. విద్యార్ధిని కాపాడేందుకు ఎమర్జెన్సీ సేవల బృందం తీవ్రంగా శ్రమించినా అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతుడిని 2021లో భారత్ నుంచి కెనడాకు వచ్చిన కార్తీక్ సైనీగా గుర్తించారు. కార్తీక్ షెరిదాన్ కాలేజ్లో చదువుతుండగా, అతడి మృతి పట్ల కాలేజ్ నిర్వాహకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కార్తీక్ మృతి పట్ల అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రొఫెసర్లకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్తీక్ మృతదేహాన్ని సత్వరమే భారత్కు పంపాలని, ఈ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారని హర్యానాకు చెందిన మృతుడి సోదరుడు తెలిపారు.