Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్ష రైల్వే జంక్షన్ వద్ద ఒక్కసారిగా ఫుట్ఓవర్ బ్రిడ్జి స్లాబులు కూలిపోయాయి. ఈ ఘటన సమయంలో బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటన సమాచారం అందగానే స్థానిక అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.