Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి హామీ నిధులను వేరే పథకాలకు దారిమళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. ఇందుకోసం నవంబర్ 30వ తేదీని గడువును కూడా ఇచ్చింది. ఆ లోపు నిధులు తిరిగి చెల్లించకపోతే ఇకపై ఈ పథకానికి నిధుల విడుదలను నిలిపేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చిన నిధుల్లో నుంచి రూ.152 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించింది.
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణల తరుణంలో కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించింది. జూన్ 9 నుంచి 12 వరకు నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను తనిఖీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి నిధుల మళ్లింపులో నిజానిజాలను నిర్ధారించుకుని ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం అమలులో, పనుల కేటాయింపులలో అవకతవకలు జరిగాయని, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించి వేరే పథకాలకు ఉపయోగించిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నిధులను అనుమతి లేని పనులకు ఖర్చు చేసినట్లు అందులో వివరించింది. దీనితో తాజాగా నోటీసుల జారీ చేసింది.