Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ పట్టణంలో ఎలుక క్రూరంగా హింసించి చంపినందుకు ఓ వ్యక్తిపై పోలీసు కేసు నమోదైంది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎలుకను ఓ ఇటుక రాయికి కట్టేసి దాన్ని డ్రైనేజిలో జారవిడిచాడు. తోకను ఇటుకరాయికి కట్టడంతో ఆ ఎలుక తప్పించుకోలేక గిలగిల్లాడింది. ఈ దృశ్యాలను జంతు హక్కుల ఉద్యమకారుడు వికేంద్ర శర్మ వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తిపై కేసు నమోదైంది. మనోజ్ కుమార్ ఎలుకను డ్రైనేజిలో ముంచుతుండడాన్ని వీడియో తీసిన వికేంద్ర శర్మ ఆ ఎలుకను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఆ మురికి కాలువ నుంచి ఆయన దాన్ని బయటికి తీసినా, కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ తరుణంలో క్రూరమైన రీతిలో ఎలుక ప్రాణాలు తీసిన మనోజ్ కుమార్ పై పోలీసులు సెక్షన్ 429, సెక్షన్ 11 (1) (1)ల కింద కేసు నమోదు చేశారు.