Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్: శాసనసభ ఎన్నికల తొలిదశ ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాలకు చెందిన 19 జిల్లాల పరిధిలోని 89 స్థానాలకు రేపు (గురువారం) పోలింగ్ జరుగనుంది. 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో వీరిలో 719 మంది పురుషులు కాగా, 69 మంది మహిళలు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో పోటీపడుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో బరిలోకి దిగింది. బీఎస్పీ, ఎంఐఎం, వామపక్షాలు కూడా పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ విడతలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ, ఆ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా లు ఉన్నారు.