Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో మరోసారి సరికొత్త గరిష్ఠ స్థాయిలను తాకాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను పెడుతుండటంతో మన మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 63,284కి చేరుకుంది. నిఫ్టీ 54 పాయింట్లు పుంజుకుని 18,813 వద్ద స్థిరపడింది. ఐటీ, రియాల్టీ, మెటల్, టెక్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: అల్ట్రాటెక్ సిమెంట్ (2.86%), టాటా స్టీల్ (2.79%), టీసీఎస్ (2.44%), టెక్ మహీంద్రా (2.20%), విప్రో (1.63%),
టాప్ లూజర్స్: ఐసీఐసీఐ బ్యాంక్ (-1.41%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.06%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.98%), కోటక్ బ్యాంక్ (-0.61%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.54%).