Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు సాయంత్రానికి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. అయితే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబును పోలీసులు అనుమతించలేదు. ఈ తరుణంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పోలీసులతో చంద్రబాబు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందరికన్నా ఆలోచనల్లో తానే యంగ్ నని చెప్పిన చంద్రబాబు 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించే శక్తి దేవుడు తనకిచ్చాడని తెలిపారు. అందుకే అందరికన్నా తాను యాక్టివ్ గా ఉంటానని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి, భావి తరాల గురించి ఆలోచించే పార్టీ టీడీపీనేన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నానని కూడా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం మండలాలన్నింటినీ కలిపి జిల్లా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.