Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన సౌదామిని 2014లో రూ. 9 లక్షలతో ఫోర్డ్ క్లాసిక్ (డీజిల్) కారు కొనుగోలు చేశారు. ఈ కారు మైలేజీ చాలా తక్కువగా ఉందని, ప్రకటనలో పేర్కొన్న దానికి, దాని వాస్తవ మైలేజీకి పొంతనే లేదంటూ ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు ఆమె ఆరోపణలను నిర్ధారించింది. ప్రకటనలో ఆ కంపెనీ లీటరుకు 32 కిలోమీటర్లు ఇస్తుందని పేర్కొనగా, వాస్తవానికి అది 19.6 కిలోమీటర్లే ఇస్తున్నట్టు తేలడంతో బాధితురాలికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. అంతే కాకుండా సౌదామినికి రూ. 3 లక్షల పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశించింది. ప్రకటనలో చెప్పిన మైలేజీకి, వాస్తవ మైలేజీకి పొంతన లేదంటూ ఓ కారు కంపెనీపై కోర్టుకెక్కిన మహిళ విజయం సాధించింది. ఆమెకు 3 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సదరు కారు కంపెనీని కోర్టు ఆదేశించింది.