Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీలోని వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు ధరించకూడదని సంప్రదాయ దుస్తులు ధరించి రావాలంటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశించినట్టుగా వచ్చిన వార్తలు వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్తలపై డీఎంఈ స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలను నమ్మొద్దని, విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న సమయంలో ఆరోగ్యశాఖ ఉద్యోగులు, వైద్యులు స్టెతస్కోప్, యాప్రాన్, ఐడీ కార్డు ధరించాలన్న అంశంపై ఉద్యోగ, ఇతర సంఘాల నాయకులతో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.