Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన పాలమూరుకు చేరుకుంటారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో ముచ్చటించనున్నారు.
తర్వాత పాలకొండ వద్ద 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. కలెక్టర్ వెంకట్రావుకు పరిపాలన పగ్గాలు అప్పజెప్పనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.