Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో లియోనల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. టోర్నీ తొలి మ్యాచ్ లోనే చిన్న జట్టు సౌదీ అరేబియా చేతిలో అనూహ్య పరాజయం పాలైన అర్జెంటీనా ఆ తర్వాత గొప్పగా పుంజుకొని నాకౌట్ చేరుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2-1తో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్పు దిశగా ముందంజ వేసింది. కెరీర్లో 1000వ మ్యాచ్ ఆడిన మెస్సీ అద్భుతమైన గోల్తో ఈ మ్యాచ్ ను మధురజ జ్ఞాపకంగా మార్చుకున్నాడు. మ్యాచ్ 35వ నిమిషంలో అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. దాంతో, ఆ జట్టు 1-0 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. సెకండాఫ్ మొదలైన వెంటనే అర్జెంటీనా ఆధిక్యం డబులైంది. 57వ నిమిషంలో జులియన్ అల్వారెజ్ చేసిన గోల్ తో ఆ జట్టు 2-0తో నిలిచింది. దీనితో ఆస్ట్రేలియాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. 77వ నిమిషంలో ఆసీస్ ఆటగాడు క్రెయిగ్ గుడ్ విన్ కొట్టిన షాట్ ప్రత్యర్థి ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ ముఖానికి తాకి ఆర్జెంటీనా గోల్ పోస్ట్ లో పడటంతో ఆ జట్టు సెల్ఫ్ గోల్ చేసుకుంది. దాంతో, 1-2తో ఆస్ట్రేలియా పుంజుకునే ప్రయత్నం చేసినా మరో గోల్ చేసే అవకాశం ఇవ్వని మెస్సీసేన టోర్నీలో ముందుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ తో అర్జెంటీనా పోటీ పడనుంది.