Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వివాహం అనంతరం హెలికాప్టర్లో ఇంటికి వెళ్లి నవదంపతులు వార్తల్లోకెక్కారు. ఉత్తర్ప్రదేశ్ రూడ్కీలోని చావ్మండీకి చెందిన సంజయ్ కుమార్ కుమారుడి వివాహం బిజ్నోర్ జిల్లాకు చెందిన నేహా ధీమాన్తో నిశ్చయమైంది. డిసెంబర్ 2న బిజ్నోర్ చాంద్పుర్లో వీరి వివాహం జరిగింది. కాగా వివాహం అనంతరం వధువును హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చాడు వరుడు. దీంతో చావ్మండీలో సందడి నెలకొంది. హెలికాప్టర్ను చూసేందుకు స్థానికులు అక్కడికి తరలివెళ్లారు.