Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు సోమవారం వేర్వేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 సదస్సు నిర్వహణపై సోమవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో జరిగే అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొంటారు. సీఎం జగన్ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని, రాత్రి 7.55 గంటలకు డిల్లీ నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణమవుతారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి 12:40కి ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.