Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నంద్యాల: జిల్లాలో బీటెక్ విద్యార్థి అబ్దుల్లా ఆత్మహత్య కలకలం రేపుతోంది. హనీప్నగర్లోని ఇంట్లో అబ్దుల్లా ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.